పింగళి వెంకయ్య కుమార్తెను సన్మానించిన సీఎం జగన్

సీఎం‌ను చూసి ఉద్వేగానికి లోనైన పింగళి వెంకయ్య కుటుంబం


గుంటూరు: సీఎం జగన్ శుక్రవారం మాచర్లలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మికి శాలువ కప్పి సన్మానం చేశారు. సీఎం జగన్‌ను చూసి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని సీఎం జగన్‌తో కలిసి పంచుకున్నారు. సీఎం సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం తిలకించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/