ప్రధాని మోడీకి మరోసారి సీఎం జగన్ లేఖ

మోడీ అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ

అమరావతి: సీఎం జగన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాశారు. స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించవద్దని, కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోరిన సీఎం జగన్‌, తనతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు.

‘విశాఖ స్టీల్స్‌పై కేంద్ర ప్ర‌భుత్వ ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సంస్థ‌‌ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం. స్టీల్‌ప్లాంట్‌పై ప్రత్యక్షంగా 20వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొస్తాం. ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం. ప్లాంట్‌ పునరుద్ధరణ కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్‌పై దృష్టిపెడితే కచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని పునరుద్ఘాటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/