నెల్లూరు జిల్లాలో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ ను ప్రారంభించిన సీఎం జగన్

cm jagan inaugurates third unit of APGENCO ae Nelaturu in Nellore

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు)ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి..జాతికి అంకితం చేసారు. ప్రభుత్వ రంగంలో దేశంలోనే మొదటిదైన ఈ సూపర్‌ క్రిటికల్‌ యూనిట్‌ రోజుకు 19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్‌ను సీఎం జగన్ గురువారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సాధారణ థర్మల్‌ పవర్‌ ప్లాంట్లతో పోలిస్తే ఈ ప్లాంట్‌లో తక్కువ బొగ్గును వినియోగిస్తారు. దీనివల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం కొంత మేర తగ్గుతుంది. రోజుకు 9,312 టన్నుల బొగ్గుతో నడిచేలా ఈ యూనిట్‌ను రూపొందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, అంబ‌టి రాంబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

ఉదయం సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు బ‌య‌లుదేరారు. రేణిగుంట వ‌ద్ద‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసుదన్‌ రెడ్డి, కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుకు వచ్చారు.