వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన సీఎం జగన్

జగన్ కాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు

అమరావతి : సీఎం జగన్ ఈరోజు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లిన సీఎంకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్ 24న వ్యాయామం చేస్తూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తున్న సందర్భంగా ఆయన కాలు బెణికింది. దీంతో ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ తో ఆయన కోలుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే కాలుకి వాపు వచ్చింది. దీంతో మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ ఆసుపత్రిలో 45 నిమిషాలు ఉన్నారు. వైద్యులు ఆయన కాలికి పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/