రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన సీఎం జగన్

ఇక నుండి మంగళగిరి ఎయిమ్స్‌లోను ఆరోగ్య‌శ్రీ సేవ‌లు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న‌న్న ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా పేద‌ల‌కు మ‌రింత నాణ్య‌మైన‌ వైద్యం అందిస్తున్నట్టు మంత్రి విడుదల రజిని అన్నారు. పేదలందరికీ మంగళగిరి ఎయిమ్స్ లోనూ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అని రజిని కీలక ప్రకటన చేశారు.

అతి త్వ‌ర‌లో పెట్ సిటీ స్కాన్ ప్రారంభం అవుతుందని, ఎయిమ్స్ సిబ్బందికి శిక్ష‌ణ ఇస్తామని, 24 గంట‌లూ ఆరోగ్య‌శ్రీ సేవ‌లు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటామని ప్రకటించారు. అద‌నంగా ఆరోగ్య‌మిత్ర‌ల‌ను నియ‌మిస్తామని, ఆరోగ్య‌శ్రీ రోగుల కోసం ఉచితంగా వాహ‌నం స‌మ‌కూరుస్తామన్నారు మంత్రి విడ‌ద‌ల ర‌జిని.