హైకోర్టులో సిఎం జగన్ పిటిషన్ దాఖలు
సుదీర్ఘకాలంగా సిఎం జగన్ పై సీబీఐ విచారణ
అమరావతి: ఏపి సిఎం జగన్ ఆక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సీఎం అయ్యాక వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, సీబీఐ న్యాయస్థానంలో ఆయనకు చుక్కెదురైంది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసుల్లో కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సిఎంగా పాలనా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/