ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపిన సీఎం జగన్

ఏపీలో ఒక్కరోజులో 13 లక్షల మందికి పైగా టీకాలు

అమరావతి: ఏపీ లో కరోనా వైరస్‌ నివారణ చర్యలు, హెల్త్ నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. నిన్న ఒక్కరోజే 13 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందించడం జాతీయస్థాయి రికార్డు కావడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనతకు కారణమైన వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆయన అభినందించారు. వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటే వాటిని ప్రజలకు అందించే సమర్థత ఉందని నిరూపించారని సీఎం వైద్య ఆరోగ్య సిబ్బందికి కితాబిచ్చారు. పక్కా ప్రణాళిక, సమర్థవంతమైన యంత్రాంగం వల్లనే ఇది సాధ్యమైందని కొనియాడారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/