జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
తనకు పిటిషన్ వేసే అర్హత లేదనడం అసంబద్ధమన్న రఘురామ
హైదరాబాద్ : సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్పై ఈ రోజు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై ఇప్పటికే జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసి, ఈ పిటిషన్ను కొట్టేయాలని కోరిన విషయం తెలిసిందే. అయితే, ఆ కౌంటర్పై రఘురామకృష్ణరాజు రీజాయిండర్ దాఖలు చేశారు. కౌంటర్లో జగన్ అసత్యపు ఆరోపణలు చేశారని తెలిపారు. తనకు పిటిషన్ వేసే అర్హత లేదనడం అసంబద్ధమని చెప్పారు. పిటిషన్ విచారణ అర్హతలపై కోర్టులు ఇప్పటికే స్పష్టతనిచ్చాయని వివరించారు. రఘురామ తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదని జగన్ చెప్పడం సరికాదన్నారు.
తనపై కేవలం ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, చార్జిషీట్ దాఖలు చేయలేదని ఆయన చెప్పారు. జగన్ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించనట్లు ఉందని తెలిపారు. కాగా, వాదనలను సమయం ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో జులై 1కి విచారణను వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/