ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్
న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరిన సీఎం జగన్కు ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ స్వాగతం పలికారు. హోంమంత్రి అమిత్ షా, జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తారు. సీఎం జగన్ తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/