ఏపి మంత్రులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

ప్రతీ బుధవారం సచివాలయంలో మంత్రులుండాలి : సిఎం జగన్‌

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి బుధవారం మంత్రులు కచ్చితంగా సచివాలయంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.ప్రజలు, అర్జీదారులు తమ అభ్యర్థనలు చెప్పుకొనేందుకు సెక్రటేరియట్‌కు వచ్చే అవకాశం ఉన్నందున.. వారి సమస్యలు పరిష్కరించే దిశగా మంత్రులు తమ పేషీల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇంతకుముందు వరకు మంగళ, బుధవారాల్లో మంత్రులు సచివాలయంలో ఉండాలని చెప్పిన సీఎం.. సంక్షేమ పథకాల అమలు, తదితర కారణాల రీత్యా బుధవారం ఒక్క రోజు మాత్రం కచ్చితంగా సెక్రటేరియట్‌లో ఉండాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మంత్రులంతా వారి షెడ్యూల్‌ను పాటించాలని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/