సిఎం జగన్ చిత్తశుద్ధి నిరూపించుకోండి
ఏపి టిడిపి మాజి ఎమ్మెల్యే అనిత
అమరావతి: ఏపి ముఖ్యమత్రిపై టిడిపి మాజి ఎమ్మెల్యే అనిత విమర్శలు గుప్పించారు. సున్నావడ్డీ పథకం ద్వారా మహిళల నోట్లో సున్నం కొట్టారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. సున్నాలేయడం, ఇచ్చిన హమీలకు సున్నాలు చుట్టడం అలవాటైన సిఎం గారు! సున్నావడ్డీ ద్వారా పథకం ప్రకారం మహిళల నోట్లో సున్నం కొట్టారు. కరోనా కష్టకాలంలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 10వేలిచ్చి మీ చిత్తశుద్ది నియీపించుకోండి. అంటూ ట్వీట్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/