ఉభయగోదావరి జిల్లాల్లో సిఎం ఏరియల్‌ సర్వే

ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సాయం

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సిఎం జగన్‌ ప్రత్యేక హెలికాఫ్టర్లో ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ముంపు గ్రామాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అంతకముందు సిఎం జగన్‌ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అక్కడి పరిస్థితులన ఆయన అడిగి తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, తాను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నానని జగన్ అన్నారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని ఆయన చెప్పారు. బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు.

సహాయక చర్యల్లో ఖర్చు విషయంలో వెనుకాడొద్దని చెప్పారు. సహాయక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కుల వరద తగ్గుతుందని తెలిసిందని జగన్ చెప్పారు. ఆ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని ఆయన చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/