మూసివేసిన తిరుమల శ్రీవారి పుష్కరిణి
కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో భాగమని టిటిడి వెల్లడి
తిరుమల: కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాపించకుండా ప్రముఖ దేవస్థానాలు వ్యాప్తి నివారణ చర్యలను విస్తుృతం చేశాయి. అందులో భాగంగా తిరుపతిలో కరోనా వ్యాప్తి చేందకుండా ఉండేందుకు టిటిడి చర్యలు చేపడుతుంది. భక్తులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను నిత్యం రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. దినిలో భాగంగా శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తున్నట్లు, పుష్కరిణి సమీపంలో 18 స్నానపు గదులు ఏర్పాటు చేశామని టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/