ఏటిఎం కార్డుల క్లోనింగ్ ముఠా గుట్టురట్టు
పది లక్షల నగదుతో పాటు స్కిమర్, క్లోనింగ్ మిషన్, 44 క్లోనడ్ కార్డ్స్ స్వాధీనం.

Hyderabad: ఏటిఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ఒడిశా కు చెందిన ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు
- నగరంలోని పలు రెస్టారెంట్లు, పబ్బులలో ఏటిఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠా..
- క్లోనింగ్ తో నకిలీ కార్డులను తయారు చేస్తున్న ముఠా..
- గచ్చిబౌలి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన కార్డు క్లోనింగ్..
- పది లక్షల నగదుతో పాటు స్కిమర్, క్లోనింగ్ మిషన్, 44 క్లోనడ్ కార్డ్స్ స్వాధీనం..
- ఇప్పటి వరకు ఈ ముఠా 140 కార్డులను క్లోనింగ్ చేశారు…
- క్లోనింగ్ కార్డులు సహాయంతో 30 లక్షలు విత్ డ్రా చేశారు..
- ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ప్రఫుల్ కుమార్ టెన్త్ క్లాస్ వరకు చదివాడు..
- ఆన్ లైన్ లో స్కిమర్, క్లోనింగ్ మిషన్ లను కొనుగోలు చేశాడు..
- హై క్లాస్ రెస్టారెంట్లు, పబ్ లలో వెయిటర్ లుగా చేరుతారు..
- కస్టమర్ బిల్లులు చెల్లించేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న స్కిమర్ సహాయంతో కార్డులోని డేటాను తస్కరిస్తారు..
- పబ్ లు, రెస్టారెంట్ల ల్లో పది రోజుల పాటే పని చేస్తారు..
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/