గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ ముందే నేతల ఘర్షణ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో నెలకొన్న గొడవలను సద్దుమణిగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. అయితే ఆయన ముందే నేతలు ఘర్షణకు దిగడం షాక్ కు గురిచేస్తుంది. గురువారం గాంధీభవన్ కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్..నేతలతో మాట్లాడుతుండగా..గాంధీ భవన్ కు చేరుకున్న ఓయూ నేతలు మాజీ ఎమ్మెల్యే అనిల్ పై దాడికి యత్నించారు. సేవ్ కాంగ్రెస్ ..సీనియర్ కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసారు.

దీంతో మల్లు రవి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకుండా అలాగే నినాదాలు చేసారు.ఎవరూ బయటకొచ్చి అరవొద్దని..అందరూ ఒకర్నొకరు గౌరవించుకోవాలని చెప్పారు. ఓయూ విద్యార్థి నేతలు శాంతించాలన్నారు. విషయం చేయిదాటున్న సంగతి తెలుసుకున్న మల్లు రవి.. మాజీ ఎమ్మెల్యే అనిల్‌ను ఓ గదిలోకి పంపించారు. అక్కడికి వచ్చిన విద్యార్థి నేతలను వేడుకున్నారు. దండం పెడంతా ఆపండి..! అంటూ మల్లు రవి వేడుకున్నారు. లోపల చర్చలు జరుగుతున్నాయని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. సహకరించాలని అభ్యర్థన.. చేజారుతున్న పరిస్థితులను చూసి ఉద్వేగపూరితంగా మాట్లాడారు మల్లు రవి.