ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నజస్టిస్ NV రమణ

విజయవాడ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మేళతాళాలతో మంగళవాయిద్యాల నడుమ ఎన్వీ రమణకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని సీజేఐ‌కు అందజేశారు. ఆలయ అధికారులతో పాటు ఎంపీ కేశినేని నాని, మంత్రి పేర్ని నాని, కలెక్టర్ నివాస్, దేవాదాయ కమిషనర్ హరి జవహర్ లాల్, వాణీమోహన్… ఎన్వీ రమణకు స్వాగతం పలికారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/