సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష వాయిదా
యూపీఎస్సీ వెల్లడి
New Delhi: సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూపీఎస్సీ వాయిదా వేసింది. జూన్ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్ 10న జరుగుతుందని ప్రకటించింది. ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం మే 31న జరగాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఏటా లక్షల మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తుంటారు. ఇక ఈ ఏడాది దాదాపుగా 796 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/