పవన్ అభిమానిగా కనిపించబోతున్న చిరంజీవి..?

మెగా అభిమానులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు..చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమాని గా వెండితెర ఫై కనిపించబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. రాజకీయాలను వదిలేసి పూర్తిగా సినిమాల ఫై ఫోకస్ పెట్టాడు చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వాల్తేర్ వీరయ్య మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి , బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు.

ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో వేదాళం రీమేక్ భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్ర లో కనిపించబోతుంది. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివారులో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిగా నటిస్తున్నారట. మూవీ మొత్తం దీనికి సంబంధించిన సన్నివేశాలను చూపించబోతున్నారని తెలుస్తుంది. ‘ఖుషీ’ సినిమాలోని ఓ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నారని అంటున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే అభిమానులకు ఇంతకన్నా మరో పండగ లేదనే చెప్పాలి. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం ఇస్తున్నాడు. ఆగస్టు లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.