మరో మలయాళ రీమేక్ కు మెగా స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మరో మలయాళ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ చిత్ర, దసరా సందర్బంగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. ఆచార్య మూవీ తో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు ఈ చిత్రం మళ్లీ జోష్ పెంచింది. విడుదలైన ప్రతి సెంటర్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. దీంతో చిత్ర యూనిట్ తో పాటు మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ తరుణంలో చిరంజీవి మరో మలయాళ రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళం లో సూపర్ సక్సెస్ సాధించిన భీష్మ పర్వం చిత్రాన్ని తెలుగు లో రంకె చేయాలనీ చూస్తున్నారట. ఈ చిత్ర తెలుగు రైట్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడని , ఆయనే తెలుగు లో నిర్మించబోతారని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందొ..దీనికి ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది.