త‌్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి త‌ల్లి క‌న్నుమూత‌

గ‌త రాత్రి తుది శ్వాస విడిచిన అలివేలు

chinajeeyar-mother-passes-away

హైదరాబాద్‌: త్రిదండి చినజీయర్‌ స్వామి తల్లి అలివేలుమంగ(85)కన్నుమూశారు. గ‌త కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో తుదిశ్వాస విడిచారు. దీంతో చిన‌జీయ‌ర్ స్వామి తీవ్ర దిగ్ర్భాంతికి గుర‌య్యారు. త‌ల్లి మ‌ర‌ణాన్ని స్వామి త‌ట్టుకోలేకపోతున్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు శంషాబాద్ ముచ్చింత‌ల్‌లోని చిన‌జీయ‌ర్ ఆశ్ర‌మం స‌మీపంలో అలివేలుమంగ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయని ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/