భారత విద్యార్థ్థులపై ఆంక్షలు విధించిన చైనా

కరోనా తగ్గిన తరువాతనే స్వదేశాలకు.. స్పష్టం చేసిన చైనా ప్రభుత్వ అధికారులు

Indian students
Indian students

చైనా: కరోనా వైరస్‌ చైనాతో పాటు పలు దేశాలను వణిస్తుంది. ఈనేపథ్యంలో చైనాలోని వివిధ ప్రాంతాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారత విద్యార్థులపై ఆ దేశ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పటికిప్పుడు ఎవరూ ఇండియాకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. కరోనా వైరస్‌ పూర్తిగా నియంత్రణలోకి వచ్చాకే విద్యార్థులు ఇండియా వెళ్లేందుకు అనుమతినిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. కరోనా వైరస్ ఇతర దేశాలకు వెళ్లకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా, చైనా తాజా నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా, భారత అధికారులు భరోసా ఇస్తున్నారు. చైనాలో వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. కొందరు వైరస్ వెలుగులోకి వచ్చిన వుహాన్ లోనూ ఉన్నారు. వీరంతా కరోనా వైరస్ తగ్గిన తరువాతనే ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/