భారత సైన్యం అదుపులోకి చైనా సైనికుడు
న్యూఢిల్లీ: భారత భద్రతా దళాలు లడాఖ్ సరిహద్దులో చైనా సైనికుడిని ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి పౌర, సైన్యానికి సంబంధించిన కీలక పాత్రలను స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)లో కార్పరల్ స్థాయి సైనికుడిగా అతడిని గుర్తించారు. కాగా అతను చైనా సైన్యంలో తుపాకీలను మరమ్మతు చేసేవాడని తెలిసింది. గూఢచారిగా భారత్కు వచ్చాడా? లేక మరేదైనా విషయం ఉందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/