724కు పెరిగిన కరోనా వైరస్ మృతులు
చైనా : చైనాలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకిన కారణంగా మరణించిన వారి సంఖ్య 724కు పెరిగింది. శుక్రవారంనాడే 86 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 34 వేలమంది కరోనా వైరస్ బారిన పడ్డారని వారన్నారు. కాగా రోజూ దాదాపు 50 నుంచీ 70 మంది దాకా చనిపోతున్నారు. అలాగే కొత్తగా రెండు మూడు వేల కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం చైనా సహా దాదాపు 30 దేశాల్లో 31 వేల మంది కరోనా వైరస్ లక్షణాలతోబాధపడుతున్నారు. చైనాలో పెద్ద ఎత్తున వైరస్ విరుగుడు కోసం మందుల పరీక్షలు సాగుతున్నాయి. ఏయే మందులు మిక్స్ చేసి ప్రయోగించినా ఈ వైరస్ చనిపోవట్లేదు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/