నేను దాని కోసమే చూస్తున్నాను

ప్రధాని..ఆర్థిక ప్యాకేజీపై స్పందించిన చిదంబరం

CHIDAMBARAM
CHIDAMBARAM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. ‘ఓ హెడ్ లైన్ పెట్టి, పేజీని ఖాళీగా వదిలేసిన మోడి దాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి చేస్తారని చెప్పారు. నేను దాని కోసమే చూస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయమై తాను నిన్ననే ఎందుకు స్పందించలేదన్న విషయాన్ని కూడా ఆయన వివరించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ మెసేజ్ ని పెట్టారు. ఆర్థిక వ్యవస్థ కోసం ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయినీ మేము జాగ్రత్తగా గమనిస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా ‘ఈ డబ్బు ప్రతి ఒక్కరికీ ఎలా సాయపడుతుందో గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా పేదలకు ఎలా ఉపకరిస్తుందో పరిశీలిస్తాం. దేశంలోని 13 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. వారికి నిజమైన డబ్బు ఏ మేరకు అందుతుందో చూడాలి’ అని కూడా అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/