కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ భాఘేల్

ఛత్తీస్గఢ్లో వింత ఆచారం..

chhattisgarh-chief-minister-bhupesh-baghel-getting-whipped-as-part-of-a-ritual-in-durg-district

దుర్గ్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్.. ఆలయంలో పూజలు చేసి కొరడా దెబ్బలు తిన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. దీపావళి మరుసటి రోజు మంగళవారం ఉదయం.. దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామంలో జరిగిన గోవర్ధన్ పూజలో భూపేష్ బఘేల్ పాల్గొన్నారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. రాష్ట్రం సుభింగా ఉండాలంటూ ప్రార్ధించారు.

కాగా.. గోవర్ధన్ పూజలో భాగంగా జజన్‌గిరి గ్రామంలో ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. పండగ రోజున గోవర్ధన పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటే అన్ని విఘ్నాలు తొలగిపోయి శుభం కలుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం.. అంతేకాకుండా పూజ అనంతరం మంసాహారాన్ని సైతం ఆరగిస్తారు. వారి నమ్మకం ప్రకారం.. సీఎం భూపేశ్ భాగేల్ ఏటా అక్కడికి చేరుకుని.. పూజలు నిర్వహించి కొరడా దెబ్బలు తింటారు. ఈ ఏడాది కూడా గోవర్ధన్ పూజలో పాల్గొని సీఎం కొరడా దెబ్బలు తిన్నారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ జాజంగిరి గ్రామంలోని గౌరా-గౌరీ చేరుకున్న అనంతరం.. ఆలయానికి చెందిన వీరేందర్ ఠాకూర్ అనే వ్యక్తి సీఎం చేతిపై 5 కొరడా దెబ్బలు కొట్టారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ముఖ్యమంత్రి ఈ గౌర-గౌరీ పూజలో పాల్గొని.. రాష్ట్రం సుభిక్షంగా ప్రార్థించారు.