కడప జిల్లాలో విషాదం : చెయ్యేరు నదిలో నీట మునిగిన ఆర్టీసీ బస్

వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎడతెరపిలేని వర్షం కారణంగా పలు జిల్లాలోని నదులు పొంగి పోర్లుతున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలంలో చెయ్యేరు నది పోటెత్తింది. ఈ క్రమంలో వరదలో చిక్కున్న ఆర్టీసీ బస్ నీటమునిగింది. ఈ ప్రమాదం లో బస్ డ్రైవర్ , కండక్టర్ , ఓ ప్రయాణికుడు మృతి చెందారు. కొంతమంది ప్రయాణికులు బస్ టాప్ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.

శివాలయంలో దీపారాధనకు భక్తులంతా బస్సులో వెళ్లారు. అయితే ఒక్కసారిగా వరద ఉదృతి పెరగడంతో బస్సు రహదారిపైనే ఆగిపోయింది. కొంతమంది కొట్టుకుపోగా మరికొందరు బస్సు రూఫ్‌ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా కాపాడమని అరుపులు, కేకలు పెడుతున్నారు. డ్రైవర్ , కండక్టర్ , ఓ ప్రయాణికుడి మృతదేహాలు లభ్యమయ్యాయి.