చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం

చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. రీసెంట్ గా గుండ్లపల్లిలో రసమయి బాలకిషన్ కాన్వాయ్‌పై యువకులు చెప్పులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న యువకులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేపైకి యువకులు దూసుకొచ్చారు. కాగా.. అక్కడి నుంచి వెళ్లిపోయేందకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడికి దిగారు. ఈ ఘటన మరవకముందే తాజాగా చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది.

అల్లవాడ గ్రామస్తులు కాలె యాదయ్యను అడ్డుకున్నారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, రోడ్లు కూడా బాగోలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభోదయం కార్యక్రమంలో భాగంగా ప్రజలను పలుకరించి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు అల్లవాడ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే యాదయ్యను అభివృద్ధి పనులపై ప్రజలు నిలదీశారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఎమ్మెల్యే వెంటనే తమ ఊరి నుంచి వెళ్లిపోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు.