నమీబియా చిరుత సాషా మృతి

గత ఏడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో నాషా అనే చిరుత ఈరోజు మరణించింది. గతేడాది నమీబియా నుంచి భారత్ కు 8 చీతాలను భారత్ కు తీసుకురాగా, మధ్యప్రదేశ్ లోని కునో అభయారణ్యంలో ప్రధాని మోదీ ఆ చీతాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో సాషా అనే చిరుత కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. అప్పటీకే చికిత్స చేసి తీసుకురాగా.. ఇక్కడికి వచ్చాక కిడ్నీ సమస్య తీవ్రత ఎక్కువై చనిపోయినట్లు అధికారులు తెలిపారు. భారత్ లో 1950 తర్వాత చీతాలు కనుమరుగయ్యాయి. జీవవైవిధ్యం కాపాడే ఉద్దేశంతో ఆఫ్రికా నుంచి భారత్ కు చీతాలను రప్పించారు. గతేడాది ఈ చీతాలు ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్నాయి.

సెప్టెంబరు 17న కునోలో ప్రధాని మోడీ విడుదల చేసిన ఐదేళ్ల వయసున్న రెండు ఆడ పెద్ద పిల్లులలో సాషా చిరుత ఒకటి. గత వారం మధ్యప్రదేశ్‌లో ఎల్టన్ , ఫ్రెడ్డీ అనే మరో రెండు చిరుతలను అడవిలోకి వదిలారు. దీంతో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో నాలుగింటిని షియోపూర్ జిల్లాలోని పార్క్‌లోని అడవిలోకి వదిలారు. మరోవైపు హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మార్చి 25న చిరుతపులి మృతి చెందింది. దీని వయసు 15 ఏళ్లు కాగా, జూలో ఉన్న ఏకైక చిరుత ఇదే కావడం గమనార్హం.