అమరావతి రైతులకు చార్లొట్ ప్రవాసాంధ్రుల మద్దతు

NRI ‘s from Charlet

US: అమెరికా లోని చార్లొట్ నగరంలో ప్రవాసాంధ్రులు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతు అమెరికా లోని చార్లొట్ నగరంలో నివసిస్తున్న దాదాపు 250 మంది ప్రవాసాంధ్రులు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చార్లొట్ నగరంలో నివసిస్తున్న పెద్దలు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున వచ్చారు. వీరంతా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి, అధికార వికేంద్రీకరణ వద్దంటూ నినదించారు. వీరంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమరావతిలో వున్న రైతులతో మాట్లాడి అక్కడ రైతులు పడుతున్న ఇబ్బద్ధులను ఎన్నారై లు అడిగి తెలుసుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి సభ్యుడు ప్రొఫెసర్ శ్రీనివాస్ కొలికపూడి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నారై లకు అమరావతిలో జరుగుతున్న పరిస్థితులు వివరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/