మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో చార్జ్ షీట్ దాఖలు

విధి నిర్వహణలో ఉంటూనే ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై రాచకొండ పోలీసులు 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వనస్థలిపురం పరిధిలో గతంలో నాగేశ్వరరావు ఓ మహిళను కిడ్నాప్ చేసి… ఆపై తన సర్వీస్ రివాల్వర్తో బెదిరించి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ మేరకు నాగేశ్వరరావుపై కిడ్నాప్తో పాటు అత్యాచారం నేరాల కింద వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
ఈ కేసులో గతంలోనే నాగేశ్వరరావును సస్పెండ్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. రెండు నెలల పాటు జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న నాగేశ్వరరావు ఇటీవలే కండీషనల్ బెయిల్తో విడుదలయ్యారు. నాగేశ్వరరావు తీవ్ర నేరాలకు పాల్పడిన నేపథ్యంలో ఆయనను సర్వీస్ నుంచి తొలగించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నాగేశ్వరరావును సర్వీసు నుంచి పూర్తిగా తొలగిస్తూ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక ఇప్పుడు నాగేశ్వరరావు కేసులో రాచకొండ పోలీసులు 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తాజాగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్లోనూ అన్ని అంశాలు పొందపరిచారు. సీసీ పుటేజ్ వివరాలు, డిఎన్ఏ రిపోర్టులు, యాక్సిడెంట్ అయిన వివరాలు, వెపన్ దుర్వినియోగం, బాధితురాలి స్టేట్మెంట్లను పోలీసులు ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. నాగేశ్వరరావుకు తగిన శిక్ష పడేలా కోర్టులో అన్ని ఆధారాలు సమర్పించారు.