పవన్ కల్యాణ్ ఇంటివద్ద రెక్కీ ఫై చంద్రబాబు స్పందన ..

tdp-chief-chandrababu

పవన్ కల్యాణ్ ఇంటివద్ద రెక్కీ చేస్తున్నారనే వార్తలపై టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తు అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాదు లో పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ ఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడుతున్నారన్నారు. పవన్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మనోహర్ చెప్పిన దగ్గరి నుండి దీనిపైనే అంత మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు ఏమైనా జరిగితే ..అభిమానుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూస్తారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో దీనిపై చంద్రబాబు స్పందించారు. “పవన్ కల్యాణ్ ఎక్కడో ఉంటే… ఆయన మీద దాడి చేస్తారంట, రెక్కీ చేస్తారంట! ఎవరిని బెదిరిస్తారు మీరు? రాష్ట్రంలో అందరినీ చంపేస్తారా? అందరినీ జైల్లో పెట్టి కొడతారా? టార్చర్ చేస్తారా మీరు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ లను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. “ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటివి చూస్తే కంపరం కలుగుతుంది, బాధ, ఆవేశం కలుగుతున్నాయి. కానీ సభ్యత అడ్డం వస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న అధికారులకు చెబుతున్నా… మీరనుకున్నది జరగదు, జరగనివ్వం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.