వైసీపీ గుండాల నుండి ప్రాణహాని ఉందని ఏపీ డీజీపీ కి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేత దాస్ కు అధికార పార్టీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి, దాస్ అలియాస్ చిన్నాలకు అధికార పార్టీకి చెందిన వారితో ప్రాణహాని ఉందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
పులి మరియా దాస్ టీడీపీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని… మరియ దాస్ రాజకీయాలలో చురుకుగా ఉండటంతో వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఆయనపై పగ పెంచుకున్నారని వివరించారు. ఎంపీ సురేష్ తన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో మరియ దాస్ను టార్గెట్ చేశారని… ఎంపీ నందిగం సురేష్ ఆదేశాలతో మరియ దాస్ పై దాదాపు 30 కేసులు పెట్టారన్నారు. ఈ వేధింపులకు పరాకాష్టగా, 18 సెప్టెంబర్ 2021న, ఉద్దండరాయునిపాలెం గ్రామం మధ్యలో మరియ దాస్పై సురేష్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని లేఖలో చంద్రబాబు వెల్లడించారు. దాస్ బిన్ను చంపాలనే ఉద్దేశంతో ప్రతి రోజు అతని కదలికలను అనుసరిస్తూ ఆయన ఇంటిపై నిఘా ఉంచారని డీజీపీకి లేఖద్వారా తెలిపారు బాబు. దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, దాస్కు ఎలాంటి హాని జరగకుండా చూసేందుకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని బాబు కోరారు.