నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు
మోడీ, అమిత్ షాలతో కీలక భేటీ
అమరావతిః ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశం కూడా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వైఎస్ఆర్సిపి పాలన, నేతలపై బిజెపి నేతల విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.