చంద్రబాబును ఎవరూ అరెస్టు చేయలేదు
శాంతి భద్రతల కారణంగానే చంద్రబాబును వెనక్కి పంపించాము
కడప: టిడిపి అధేనత చంద్రబాబు నాయుడు పర్యటనను ప్రజలే అడ్డుకున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..రాజకీయం చేసేందుకే చంద్రబాబు విశాఖలో పర్యటించడానికి వచ్చారని విమర్శించారు. చంద్రబాబు పార్టీ కార్యక్రమాల కోసం అక్కడికెళ్లారన్నారు. శాంతి భద్రతల కారణంగానే చంద్రబాబును వెనక్కి పంపాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబును ఎవరూ అరెస్టు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు అప్పట్లో మెచ్చుకున్న పోలీసులే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారని సుచరిత గుర్తు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/