పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
దుర్మార్గుల పాలనలో మంచివాళ్లు పడే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే అమరావతి భూములపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. టిడిపిపై రాజకీయ కక్షతోనే అమరావతిపై వైఎస్ఆర్సిపి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లు పడే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని పేర్కొన్నారు. తమ దోపిడీకి ఇదే చివరి అవకాశం అనే రీతిలో వైఎస్ఆర్సిపి బరితెగించిందని అన్నారు.
ప్రజల సహనానికి కూడా హద్దులు దాటిపోయాయని, వైఎస్ఆర్సిపి దుర్మార్గాలపై ప్రజలే తిరగబడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎస్సీ ఆడబిడ్డల మానానికి, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు, మాట్లాడే హక్కులేదని, ప్రాథమిక హక్కులనే కాదు, జీవించే హక్కులను కూడా కాలరాస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ఏడాదిన్నరలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులూ చేసిందని ఆరోపించారు. జంగారెడ్డి గూడెంలో నలుగురు ఎస్సీ యువకులపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/