ఈరోజు నుండి చంద్రబాబు జిల్లాల పర్యటన ..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు నుండి జిల్లాల పర్యటన మొదలుపెట్టబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లాల పర్యటనును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ నియోజకవర్గంలో ఈరోజు చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. 5న భీమిలి నియోజవర్గం తాళ్లవలస గ్రామం, 6న ముమ్మడివరం నియోజవర్గం, కోరింగ గ్రామంలో జరిగే బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రభుత్వ పన్ను పోటు, బాదుడుపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న టీడీపీ నేతలు… మహానాడు వరకు వివిధ జిల్లాలలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకి వివరించడమే టీడీపీ ప్రధాన ఎజెండాగా తెలుస్తోంది. పన్నులు, ఛార్జీలు పెంచేసి ప్రజల నడ్డివిరుస్తున్నారని బాదుడే బాదుడు పేరుతో నిరసనలను టీడీపీ చేపడుతోంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించి చాలా రోజులైంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండుసార్లు వచ్చినా శ్రీకాకుళంలో మాత్రం అడుగుపెట్టి చాలా కాలమైంది. అందుకే చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లి మళ్లీ పుంజుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.