రైతుల దీక్షలో చంద్రబాబు దంపతులు

దీక్షకు మద్దతు తెలిపిన పలువురు టిడిపి నేతలు

Chandrababu
Chandrababu

అమరావతి: రాజధానిలో రైతులు చేస్తున్న దీక్షలో టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతిలో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆయన నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. ఆయనతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఎర్రబాలెంలో రైతులు చేస్తున్న దీక్షలో పాల్గొని మద్దతునిచ్చారు. రైతులతో చంద్రబాబు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు సమస్యలను చంద్రబాబుకు వివరించారు. ఈ దీక్షకు టిడిపి నేతలు గల్లా అరుణ, బోండా ఉమ, కనకమేడల రవీంద్రలు రైతులకు మద్దతు తెలిపారు. కాగా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గత 15 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/