రైతులకు బేడీలు వేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి

కేడీల రాజ్యంలో రైతులకు బేడీలు..చంద్రబాబు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా ఏపికి మరో అప్రదిష్ఠ మూటగట్టారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా అనే చర్చకు దేశవ్యాప్తంగా తెరదీశారని చెప్పారు. గత 17 నెలలుగా రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టని రైతు కుటుంబాలు లేవని విమర్శించారు. అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభ పెడుతున్నారని ప్రశ్నించారు. ‘మద్దతు ధర అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు, తమ భూములు లాక్కోవద్దని వేడుకున్న రైతులపై తప్పుడు కేసులు, స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు. తాను అమ్మని ధాన్యానికి డబ్బులు తనకొద్దు అన్న నిజాయితీకి వేధింపులు’ అని చంద్రబాబు చెప్పారు.

‘ఏడాదిన్నరలో వేలాది రైతులపై ఇన్ని అక్రమ కేసులు ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా? దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా..? పురుగు మందు డబ్బాలతో దళిత మహిళలు తమ భూముల్లో పహారా తిరగడం ఎప్పుడైనా జరిగిందా?’ అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్లు చేశారు.
‘ఏడాదిన్నరలో వేలాది రైతులపై ఇన్ని అక్రమ కేసులు ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా? దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా..? పురుగు మందు డబ్బాలతో దళిత మహిళలు తమ భూముల్లో పహారా తిరగడం ఎప్పుడైనా జరిగిందా?’ అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్లు చేశారు.

‘అసైన్డ్ భూములను లాక్కుని దళిత రైతుల పొట్టగొట్టడానికా మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లావేళ్లా పడి అడిగి తీసుకుంది..? ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఉసురు పోసుకుంటారా?’ అని నిలదీశారు. ‘ఫిర్యాదుదారు కేసును ఉపసంహరించుకున్న తర్వాత కూడా రాజధాని రైతుల చేతులకు బేడీలు వేయడం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం’ అని చంద్రబాబు చెప్పారు. ‘గతంలో రైతుల కాళ్లకు బేడీలు వేసిన పాార్టీకి పట్టిన గతే వైఎస్‌ఆర్‌సిపికి కూడా పడుతుంది. రైతులకు బేడీలు వేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి, ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/