కృష్ణా జిల్లా పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్ ..

కృష్ణా జిల్లా పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్ పీకారు. 14 నియోజకవర్గాలు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులతో సమావేశమైన చంద్రబాబు.. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమా హాజరు కాలేదు. ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో ఉన్నందున రాలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేతలు రాకపోవడం ఫై చంద్రబాబు కాస్త అసహనం వ్యక్తం చేసారు. ఇక కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై దాడి జరిగితే పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు ఎందుకు స్పందిచలేదనని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇలాంటి సంఘటన జరిగితే అక్కడకు ఎందుకు వెళ్లలేదని , ఇదేనా మీరు పార్టీకి చేసేదని మండిపడ్డారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే పార్టీ నేతల నుంచి ఎందుకు స్పందన లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల మధ్య సమన్వయం లోపించడంపై ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాగే ఉంటే ఊరుకోబోనని హెచ్చరించారు. గురువారం జరిగే సమావేశానికి అందరూ హాజరు కావాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తలు, నేతలపై దాడులు జరిగితే కలిసికట్టుగా ఎదుర్కోవాలని.. ఈ నెల 12 లేదా 13 తేదీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.