పల్నాడులో శాంతి భద్రతల దుస్థితికి ఈ హత్య నిదర్శనం: చంద్రబాబు

టిడిపి ముస్లిం నేత హత్యపై చంద్రబాబు ట్వీట్

chandrababu-slams-ysrcp

న్యూఢిల్లీః ఏపిలోని పల్నాడులో జరిగిన టిడిపి నేత షేక్ ఇబ్రహీం హత్యపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇబ్రహీం హత్య అత్యంత కిరాతకమని చంద్రబాబు ట్వీట్ చేశారు. పల్నాడులో శాంతి భద్రతల దుస్థితికి ఈ హత్య నిదర్శనమని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి పల్నాడును ఏంచేయాలనుకుంటున్నారోనని అన్నారు. ఇబ్రహీం హత్యపై జవాబు చెప్పాలని సీఎం జగన్ ను నిలదీశారు. పల్నాడు జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం చంద్రబాబు ట్వీట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః