ఆ బాలికను దత్తత తీసుకుంటాం

బాధితురాలకి పార్టీ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయం

chandrababu-press-meet

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు రాజమండ్రిలో దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన పై మాట్లాడుతూ..ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి టిడిపి తరపున తక్షణమే రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ ఘటనపై చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేశారు. కమిటీ సభ్యులు నిన్న రాజమండ్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు. అనంతరం నివేదికను చంద్రబాబుకు అందించారు. బాలిక పదో తరగతి వరకు చదువుకుందని చంద్రబాబుకు టిడిపి నేతలు చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, బాలికను దత్తత తీసుకుని చదివిస్తామని చెప్పారు. టిడిపి అండగా ఉంటుందనే భరోసాను ఆమెకు కలిగించాలని అన్నారు. ఇలాంటి దుర్మార్గాలపై పోరాడే వీరవనితగా ఆమెను తీర్చిదిద్దాల్సి బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/