కుప్పంలో దాడుల సంస్కృతి తెచ్చారు : చంద్రబాబు

కుప్పంలోని ఓ దాబా నిర్వాహకులపై దాడి..

అమరావతి: ప్రశాంతంగా ఉండే కుప్పంలో దాడుల సంస్కృతిని వైస్సార్సీపీ తీసుకురావడం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలోని ఓ హోటల్ (దాబా) పై వైస్సార్సీపీ కౌన్సిలర్లు చేసిన దాడిని ఆయన ఖండించారు. హోటల్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేసి మహిళలను బెదిరించారని మండిపడ్డారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు.

కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఒక కౌన్సిలర్, మరో కౌన్సిలర్ కుమారుడు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకులు తెలిపారు. కుప్పం బైపాస్ రోడ్డులో ఈ దాబా ఉంది. దాబాలో వైస్సార్సీపీ నేతలు చేసిన దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో వచ్చాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/