వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన..చంద్రబాబుకు ఘన స్వాగతం

ఈ రాత్రికి భద్రాచలంలో బస చేయనున్న టీడీపీ అధినేత

chandrababu-receives-grand-welcome-in-khammam-district

అమరావతిః ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో నేడు చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విలీన మండలాలకు ఆయన పయనమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.

ఈ రోజు ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని శివకాశీపురం, కుక్కునూరు గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. అలాగే తెలంగాణలోని బూర్గంపహాడ్ లో పర్యటించబోతున్నారు. రాత్రికి ఆయన భద్రాచలంలో బస చేయనున్నారు. రేపు ఏపీకి చెందిన ఎటపాక, వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని కోతులగుట్ట, తోటపల్లి, రేఖపల్లి, కూనవరం ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/