ప్రకాశం టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం

Chandrababu
Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లాకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యె గా గెలుపొందినా నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నానని ఎప్పటి నుంచో వాపోతున్న ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యె కరణం బలరాం అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉండడంతో చం ద్రబాబు అప్రమత్తమయ్యారు. కరణం నిష్క్రమించినా పార్టీకి ఎటువంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముం దు జాగ్రత్తలపై చర్చించేందుకు పార్టీ నేతలతో ఈ రోజు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, స్వామితోపాటు రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. కరణం నిష్క్రమణ కారణాలు, గతంలో అధికారుల తీరు పై చంద్రబాబుకు పలుమార్లు ఆయన ఫిర్యాదు చేసిన అంశాలు ప్రస్తావించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/