బూత్ కమిటీల నియామకంఫై చంద్రబాబు సమీక్ష
క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నిర్మాణంపై జోనల్ ఇన్ఛార్జ్లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి చంద్రబాబు నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..క్లస్టర్ ఇంఛార్జ్ నియామకాలు పూర్తి కాని 30 నియోజకవర్గాలపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లో క్లస్టర్ , యూనిట్ నియామకాలు వారంరోజుల్లోపూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా బూత్ కమిటీల నియామకం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు.
ఆగస్టు మొదటి వారం నుంచి 15వ తేదీలోపు సెక్షన్ల నియామకం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం జోనల్ ఇన్ఛార్జ్లు సంబంధిత జోనల్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. నిర్దేశిత సమయంలోపు కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జోన్-1 ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న, జోన్-2 ఇన్ఛార్జ్ ప్రత్తిపాటి పుల్లారావు, జోన్-3 ఇన్ఛార్జ్ డోలా బాలవీరాంజనేయస్వామి, జోన్-4 ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్, జోన్-5 ఇన్ఛార్జ్ అమర్నాథ్ రెడ్డిలకు పలు ఆదేశాలు ఇచ్చారు.