ఏపిలో దయనీయ పరిస్థితులపై చంద్రబాబు వీడియో
శ్రీకాకుళం రిమ్స్ లోని ఈ పేషంట్లను తక్షణం ఆదుకోండి
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపిలో వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి అంటూ ట్విటర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటే… ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి? శ్రీకాకుళం రిమ్స్ లోని ఈ పేషంట్ లను తక్షణం ఆదుకోండి’ అని ఆయన కోరారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరితే ఎవ్వరూ పట్టించుకోవట్లేదని ఓ యువకుడు చెప్పాడు. తన ఆరోగ్యం విషమిస్తోందని, తన తల్లి జాగ్రత అని అతడు చెప్పాడు. తన రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోయాయని, వైద్య సిబ్బంది ఆసుపత్రిలోనే ఉన్నప్పటికీ తనకు సరైన చికిత్స అందించట్లేదని అతడు వివరించాడు. ఎంతో బాధపడుతూ అతడు చేసిన ఈ వ్యాఖ్యలు కన్నీరు పెట్టిస్తున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/