కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి జగన్‌ – చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు నుండి జిల్లాల పర్యటన మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లాల పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భాంగా జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి జగన్‌. నిత్యావసరాల ధరలు భారీగా పెంచారు. విద్యుత్ ఉండదు కానీ.. బిల్లు మాత్రం బాదుడే బాదుడు. నేను ఫైబర్‌నెట్‌ రూ.140కి ఇస్తే… రూ.290కి పెంచారు. రాష్ట్రంలో విచిత్రమైన బ్రాండ్ల వల్ల నాటు సారా పెరిగింది. నేను జగన్‌లా దోచుకోలేదు… దాచుకోలేదు అన్నారు. జగన్ పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేదన్నారు. వారంలో 5 ఘటనలు, నెలలో 30 సంఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ ఒక్క ఛాన్స్ అనగానే అందరూ మాయలో పడ్డారని.., 151 సీట్లు రావటంతో జగన్‌కు అహంకారం పెరిగిందని ఆక్షేపించారు. ‘‘నా ఇంటిపై దాడి చేయటమే కాకుండా అసెంబ్లీలో నన్ను అవమానించారు. నా కుటుంబసభ్యులను అవమానించారు అని చంద్రబాబు వాపోయారు. పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచారన్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. జగన్ వల్ల రాష్ట్రం మరో శ్రీలంక అవ్వడం ఖాయమని అన్నారు.