ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, బాలయ్య

ఏపిలో నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాలు1లో పోలింగ్ బూత్‌ వద్దకు వచ్చిన పలువురు టిడిపి నేతలు ఓట్లు వేశారు. టిడిపి తరఫున బాలకృష్ణ తొలి ఓటు వేశారు. అనంతరం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి కూడా ఓటు వేసేందుకు వచ్చారు. కాగా ఓటు వేసేందుకు టిడిపినేత అచ్చెన్నాయుడు హాజరుకాలేకపోయారు. కస్టడీలో ఉంటూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న ఆయనకు ఇంకా అనుమతి రాలేదని టిడిపి తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/