ప్రజలను రెచ్చగొట్టేందుకే చంద్రబాబు ప్రయత్నాలు
ఉత్తరాంధ్రకు, రాయలసీమకు వస్తే ప్రజలే స్వచ్ఛందంగా తరిమి కొడతారు
్డవిశాఖపట్టణం: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైజాగ్ ఎయిర్ పోర్టు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అడ్డుకోగా భద్రతా కారణాల రీత్యా పోలీసులు ఆయనను ముందస్తు చర్యగా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం చేశారని, కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమకు బాబు వస్తే ప్రజలే స్వచ్ఛందంగా తరిమి కొడతారనడానికి ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాబు అడ్డుపడుతున్నారని, వికేంద్రీకరణ చేస్తే బాబుకు కడుపు మంట ఎందుకు అని ప్రశ్నించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/