70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది
కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా?
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని చంద్రబాబు నాయుడు 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. టిడిపి కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఏలా? చంద్రబాబు అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా అని అన్నారు. చివరకు స్లోగన్స్ ఇచ్చి అందరూ తనతోనే ఉన్నారని చంద్రబాబు భ్రమపడి ఇంకో చోటుకి బయదేరుతున్నాడని విమర్శించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/